ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- March 26, 2026
దోహా: ఖతార్ ను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత వాతావరణ హెచ్చుతగ్గుల నేపథ్యంలో వృత్తిపరమైన భద్రతా ప్రమాణాలను బలోపేతం చేసే క్రమంలో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) సేఫ్టీ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. పని ప్రదేశంలో కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు అందరికీ సురక్షితమైన పని వాతావరణాన్ని కొనసాగించడానికి వీలుగా ఈ మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. యజమానులు మరియు కార్మికులందరూ కార్మిక శాఖ మార్గదర్శకాలను పాటించాలని కోరింది.
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ప్రమాదకరమైన పనులను నిర్వహించే క్రమంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే పరిస్థితులకు అనుగుణంగా అధిక-ప్రమాదకర కార్యకలాపాలను నిలిపివేయాలంది. వాటర్ డ్రైన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయని మరియు వర్క్ సైట్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం వంటి భద్రతపరమైన పనులను నిరంతరం సమీక్షించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో కార్మికుల రవాణా విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పని గంటలను సర్దుబాటు చేయాలని మంత్రిత్వశాఖ సూచించింది. వాహనాలు సురక్షితంగా ఉండేలా నిరంతరం సమీక్షించాలని, అన్ని సమయాల్లో సురక్షిత డ్రైవింగ్ పద్ధతులను పాటించాలని ఆదేశించింది.
కార్మికుల వసతి గృహాల విషయానికొస్తే, అక్కడ నీరు నిలవకుండా మరియు ప్రమాదాలు లేకుండా చూసుకోవాలని, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, నిత్యావసర వస్తువుల సరఫరాను అందుబాటులో ఉంచుకోవాలని మరియు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలని కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది.
ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను నిర్వహించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైనప్పుడు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని కార్మిక మంత్రిత్వ శాఖ కాంట్రాక్టులను, కార్మికులకు సూచించింది. ఈ మేరకు అవగాహన వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









