జులై 21 వరకు ఇండియా - అబుధాబి విమానాల సస్పెన్షన్ కొనసాగింపు: ఎతిహాద్

- June 29, 2021 , by Maagulf
జులై 21 వరకు ఇండియా - అబుధాబి విమానాల సస్పెన్షన్ కొనసాగింపు: ఎతిహాద్

అబుధాబి: అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్, ఇండియా నుంచి అబుధాబికి నడిచే విమానాల్ని జులై 21 వరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఈ సస్పెన్షన్ అమల్లో వుందని పేర్కొంది. ట్విట్టర్ ద్వారా ఓ ప్రయాణీకుడు సంధించిన ప్రశ్నకు సమాధానంగా ఎతిహాద్ ఈ విషయాన్ని వెల్లడించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ, సోషల్ మీడియా వేదికగా వివిధ దేశాల నుంచి విమానాల రద్దుపై ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్తాన్, లైబీరియా, నాంబియా, సియెర్రా లియోన్, డిఆర్ కాంగో, ఉగాండా, జాంబియా, వియెత్నాం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, నైజీరియా మరియు సౌతాఫ్రికా తదితర దేశాలు ఈ తాత్కాలిక నిషేధం లిస్టులో వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com