ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- June 30, 2021
అమరావతి: సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
•9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.
•మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం.
•ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనిర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం.
•విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని యూనివర్శిటీగా మార్చేందుకు ఆమోదం.
•సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోకి కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలని నిర్ణయం. విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.
•టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5,990 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్.
•విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు ఎకరాకు రూ. 25 లక్షల చెప్పున 81 ఎకరాలను కేటాయించేందుకు అంగీకారం.
•ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరు.
•హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు ఆమోదం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









