డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- March 30, 2026
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ఏప్రిల్ 1 నుండి సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.ఈ నూతన విధానం ప్రకారం అన్ని రకాల ఆన్లైన్ చెల్లింపులకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు జరిపే ప్రతి లావాదేవీకి రెండు స్థాయిల ధృవీకరణ అవసరమవుతుంది.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం చాలా వరకు డిజిటల్ లావాదేవీలు కేవలం మొబైల్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా పూర్తవుతున్నాయి. అయితే ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే నిబంధనల ప్రకారం వినియోగదారులు లావాదేవీని విజయవంతంగా పూర్తి చేయడానికి ఓటీపీతో పాటు మరొక అదనపు భద్రతా పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యక్తిగత పిన్ (PIN), పాస్వర్డ్ లేదా వేలిముద్రలు మరియు ఫేస్ ఐడి వంటి బయోమెట్రిక్ విధానాలలో ఏదో ఒకదానిని రెండవ ధృవీకరణ పద్ధతిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రెండు స్థాయిల గుర్తింపు ప్రక్రియ పూర్తయితేనే బ్యాంక్ ఖాతా నుండి నగదు బదిలీ జరుగుతుంది.
ఈ కఠినతరమైన భద్రతా చర్యల వల్ల ఆన్లైన్ మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో వినియోగదారుల పాస్వర్డ్ లేదా ఓటీపీని దొంగిలించి ఖాతాల నుండి నగదును మళ్లించేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం నేరగాళ్లకు ఓటీపీ తెలిసినప్పటికీ, వినియోగదారుడి పిన్ లేదా బయోమెట్రిక్ వివరాలు లేనిదే లావాదేవీని పూర్తి చేయడం సాధ్యపడదు.దీనివల్ల సామాన్య ప్రజల సొమ్ముకు డిజిటల్ ప్రపంచంలో మెరుగైన రక్షణ లభిస్తుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ 2 ప్రారంభం
- 2026 జూన్ 1 నుంచి యూఏఈ ప్రైవేట్ రంగానికి ఏకీకృత జీతాల గడువు అమలు
- ఫేక్ ఉద్యోగాల పేరిట మహిళలను ఆకర్షించి, లైంగిక దోపిడీ..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- కువైట్ లో 'WAMD' సాంకేతిక వైఫల్యాలకు ఫైన్స్..!!
- సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!
- లోకల్ తేనె విక్రయాలపై అవేర్ నెస్ వర్క్ షాప్..!!
- ఒమానీ రియాల్కు 250 మార్కును దాటిన రూపాయి..!!
- మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్సన్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..









