కేసీఆర్ అందరిని మోసం చేశారు : రేవంత్ రెడ్డి
- June 30, 2021
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. జనాభా ప్రాతిపదికన బలహీనవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.. పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి గాంధీభవన్కు వెళ్లారు రేవంత్ రెడ్డి.. అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ను ఘనంగా సత్కరించారు.. భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.. జులై 7న బాధ్యతల స్వీకరణ తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు తప్ప ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారంటూ విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి.. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు.. సామాజిక న్యాయం జరగలేదన్నారు.. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని.. ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి మనమంతా పోరాడాలని డీసీసీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







