భారత్-ఖతార్ ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు పెంపు

- July 02, 2021 , by Maagulf
భారత్-ఖతార్ ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు పెంపు

దోహా: భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీ గురువారం ప్రకటించింది.ఈ ఒప్పందం ప్రకారం విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు ఇండియన్ ఎంబసీ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.భారత్, ఖతార్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు 2021 జూలై వరకు పొడిగించబడింది. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలకు చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీలు, విమానయాన సంస్థలకు ధన్యవాదాలు అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.కాగా, ఇంతకుముందు ఉన్న ఒప్పందం ప్రకారం ఎయిర్ బబుల్ గడువు జూన్ 30 తో ముగిసింది.దీంతో తాజాగా ఇరు దేశాలు చర్చల అనంతరం గడువును జూలై 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.  

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com