భారత్-ఖతార్ ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు పెంపు
- July 02, 2021
దోహా: భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ఖతార్లోని ఇండియన్ ఎంబసీ గురువారం ప్రకటించింది.ఈ ఒప్పందం ప్రకారం విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు ఇండియన్ ఎంబసీ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.భారత్, ఖతార్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు 2021 జూలై వరకు పొడిగించబడింది. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలకు చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీలు, విమానయాన సంస్థలకు ధన్యవాదాలు అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.కాగా, ఇంతకుముందు ఉన్న ఒప్పందం ప్రకారం ఎయిర్ బబుల్ గడువు జూన్ 30 తో ముగిసింది.దీంతో తాజాగా ఇరు దేశాలు చర్చల అనంతరం గడువును జూలై 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









