భారత్-ఖతార్ ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు పెంపు
- July 02, 2021దోహా: భారత్-ఖతార్ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ఖతార్లోని ఇండియన్ ఎంబసీ గురువారం ప్రకటించింది.ఈ ఒప్పందం ప్రకారం విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమైనట్లు ఇండియన్ ఎంబసీ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది.భారత్, ఖతార్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం గడువు 2021 జూలై వరకు పొడిగించబడింది. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలకు చెందిన సివిల్ ఏవియేషన్ అథారిటీలు, విమానయాన సంస్థలకు ధన్యవాదాలు అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.కాగా, ఇంతకుముందు ఉన్న ఒప్పందం ప్రకారం ఎయిర్ బబుల్ గడువు జూన్ 30 తో ముగిసింది.దీంతో తాజాగా ఇరు దేశాలు చర్చల అనంతరం గడువును జూలై 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు