ఎక్స్పో 2020: రెట్టింపు సామర్థ్యంతో పనిచేయాలన్న షేక్ హమదాన్
- July 03, 2021
దుబాయ్: అక్టోబర్ నెలలో జరగాల్సి వున్న ఎక్స్పో 2020 కోసం రెట్టింపు సామర్థ్యంతో పనిచేయాల్సి వుందని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ అభిప్రాయపడ్డారు.లక్ష్యాన్ని అందుకోవడానికి తగినంత శక్తి మనకుందని చెబుతూ, రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి వుందని అన్నారు.సుప్రీం కమిటీ ఫర్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దుబాయ్తో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ప్రతి ఒక్కరి ఆరోగ్యం,భద్రత పరిగణనలోకి తీసుకుని,ఆరు నెలల మెగా ఈవెంట్ విషయంలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.కాగా, దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రారంభించిన వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ గురించి కూడా క్రౌన్ ప్రిన్స్ ఆరా తీశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







