ఇండియాలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- July 07, 2021
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా, నేడు మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. భారత్లో నిన్న 111 రోజుల కనిష్ట కరోనా కేసులు నమోదుకాగా, నిన్నటితో పోల్చితే నేడు 9వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. డెల్టా మరియు డెల్టా ప్లస్ కరోనా కేసులపై ఆందోళన అక్కర్లేదని, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇండియాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం (జులై 7న) ఉదయం 8 గంటల వరకు 19 లక్షల 7 వేల 216 శాంపిల్స్కు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 43,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే దేశంలో ఇప్పటివరకూ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,06,63,665కు (30 కోట్ల 6 లక్షల 63 వేల 665)కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే కరోనా కేసులతో పాటు కోవిడ్19 (COVID-19 Delta Variant) మరణాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో మరో 930 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. దేశంలో మొత్తం కోవిడ్19 మరణాలు 4,04,211 (4 లక్షల 4 వేల 211)కు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో చికిత్స అనంతరం దేశవ్యాప్తంగా మరో 47,240 మంది కరోనా మహమ్మారిని జయించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ 2,97,99,534 (2 కోట్ల 97 లక్షల 99 వేల 534) మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఇండియాలో ప్రస్తుతం 4,59,920 (4 లక్షల 59 వేల 920) యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొంది. భారత్లో ఇప్పటివరకూ 36 కోట్ల 13 లక్షల 23 వేల 548 డోసుల కరోనా వ్యాక్సినేషన్ (COVID-19 Vaccine) ప్రక్రియ పూర్తయింది. గత ఏడాది నుంచి దేశంలో 42 కోట్ల 33 లక్షల 32 వేల 97 శాంపిల్స్కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







