కోలీవుడ్లో హీరోగా రీఎంట్రీ కానున్నా ప్రభుదేవా ..
- March 09, 2016
ప్రభుదేవా రీఎంట్రీ అవుతున్నారు. డాన్స్, నటన, దర్శకత్వంలో రాణించడంతో పాటు, బహుభాషా కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా 2004 విజయకాంత్తో కలసి నటించిన ఎంగళ్ అన్నా చిత్రం విడుదలైంది. ఆ తరువాత ఆయన నటించిన తమిళ చిత్రం తెరపైకి రాలేదు. ఆ మధ్య కలవాడియ పొళుదుగళ్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించినా ఆ చిత్రం ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దర్శత్వం పైనే దృష్టి సారించిన ప్రభుదేవా బాలీవుడ్లో పలు భారీ చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు.తాజాగా కోలీవుడ్లో హీరోగా రీఎంట్రీ కానున్నారు.విజయ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ ఈ మధ్య నటనకు చాలా దూరంగా ఉన్నానన్నారు. ఒక హారర్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని తెలిపారు.అది ఇప్పుడు నటుడిగా నెరవేరబోతోందని అన్నారు.హారర్ కథా చిత్రంలో తాను నటించడం ఇదే తొలి సారి అని అన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందన్నారు. ప్రభుదేవా సరసన తమన్న నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం.ఈ చిత్రం ప్రస్తుతం పూనేలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







