గిరిజనుల సమక్షంలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్

- July 12, 2021 , by Maagulf
గిరిజనుల సమక్షంలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తెలంగాణ గవర్నర్

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నారు.ఇవ్వాళ ఆమె రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో గిరిజనుల సమక్షంలో రెండో డోసు తీసుకున్నారు. గిరిజన గ్రామాలు, తండాల్లో వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని, వారిలో భయాలను పోగొట్టేందుకే తాను వారి సమక్షంలో వ్యాక్సిన్ వేసుకున్నానని చెప్పారు.

తండాల్లో వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆయుధం వ్యాక్సినే అన్నారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ను తీసుకోవడం గర్వకారణమని, సొంత వ్యాక్సిన్ తో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు బాగున్నాయని ఆమె అభినందించారు. గిరిజనుల్లో అవగాహన పెంచడానికి గవర్నర్ వారి సమక్షంలోనే వ్యాక్సిన్ తీసుకోవడం అభినందనీయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గిరిజన మహిళల్లో ఉన్న భయాలను తొలగించేందుకే ఆమె వచ్చారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com