భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్
- July 12, 2021యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ అధికారిక ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్. ఈ క్రమంలో, జులై 21 వరకు భారత్ నుంచి విమానాలను అనుమతించబోమని స్పష్టం చేసింది ఎమిరేట్స్. అంతేకాదు..గత 14 రోజుల్లో భారత్ కు వెళ్లిన వారికి...ఇతర ఏ దేశం మీదుగానైనా యూఏఈకి వచ్చేందుకు అనుమతి నిరాకరించబడుతుందని వెల్లడించింది. అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే...భారత్ నుంచి ప్రయాణాల ఆంక్షలు ఉండటంతో యూఏఈకి వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి నేరుగా అనుమతి లేకపోవటంతో ఇతర దేశాలకు వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాత యూఏఈ వెళ్లాల్సి వస్తోంది. విమానాల రద్దుతో భారత్ లో చిక్కుకున్న వాళ్లంతా తమ ఉద్యోగాలను కొల్పోకముందే యూఏఈ చేరుకునేందుకు ఎక్కువగా అర్మేనియా, బహ్రెయిన్ మీదుగా వెళ్తున్నారు. అయితే..కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అర్మేనియా కూడా భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. దీంతో భారత్ నుంచి యూఏఈ వెళ్లే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా కుచించుకుపోతున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు