నేపాల్ బాధితులకు అండగా నిలిచిన తెలుగుదనం..

- June 03, 2015 , by Maagulf
నేపాల్ బాధితులకు అండగా నిలిచిన తెలుగుదనం..

 

 

నేపాల్లో సంభవించిన భూకంపం అనంతరం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ దేశాల్లో ఇతోదికంగా సహాయపడుతున్నాయి. తమవంతు సాయంగా అబుధాబి నుంచి భూకంప బాధితుల కోసం భారీగా బ్లాంకెట్స్, టెంట్లను ముస్తాఫ్ఫా తెలుగు అసోసియేషన్ వారు ప్రముఖ న్యాయవాది కం నేపాల్‌ ఎంబసీలో న్యాయసలహాదారు గా వ్యవహరిస్తున్న ఒబిలిశెట్టి అనురాధ గారు అంబాసిడర్ మిస్టర్ ధనంజయ్ జ్హ కు అందించారు. యూఏఈ నాయకులు, ప్రజలు ఎంతో విశాల హృదయం గలవారనీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ముందుంటారనీ చెబుతూ, నేపాల్ భూకంప మృతులకు సంతాపం తెలిపారు. యూఏఈ నాయకుల సూచన మేరకు ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెప్పారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com