ఏసీల చోరీ కేసులో వీడిన మిస్టరీ..దొంగ అరెస్ట్

- July 18, 2021 , by Maagulf
ఏసీల చోరీ కేసులో వీడిన మిస్టరీ..దొంగ అరెస్ట్

బహ్రెయిన్: అది బహ్రెయిన్ సౌతర్న్ గవర్నరేట్ పరిధిలోని అల్ ఇస్తిక్లాల్ స్ట్రీట్. అక్కడ దారి వెంబడి ఉన్న మొబైల్ ఫుడ్ కార్ట్స్ నుంచి వరుసగా ఏసీలు మాయం అవుతున్నాయి. మొబైల్ బండ్లకు ఏర్పాటు చేసిన జనరేటర్ బ్యాటరీలు కనిపించకుండా పోతున్నాయి. ఎలా మాయం అవుతున్నాయో తెలియదు. ఎవరూ తీస్తున్నారో అంతు చిక్కటం లేదు. దీంతో మొబైల్ ఫుడ్ కార్ట్స్ వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుస చోరీలపై పోలీసులు ఫోకస్ చేశారు. అన్ని మొబైల్ బండ్ల దగ్గర ఏసీలు, జనరేటర్ బ్యాటరీలు మాత్రమే కనిపించకుండా పోతుండటం..చోరీ విధానం ఒకే రకంగా ఉండటంతో దొంగ ఒక్కడే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. కేసు బుక్ చేసుకొని ఏసీల దొంగ కోసం నిఘా వేశారు. చివరకు ఏసీల దొంగను పట్టుకొని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com