కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకిన ఘటనలే దిగుమతులపై కువైట్ నిషేధం..
- March 10, 2016
భారత్ నుంచి జరుగుతున్న పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ నిషేధం విధించింది. ఇటీవల దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకిన ఘటనలే ఇందుకు కారణం. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న గుడ్లుపెట్టే కోళ్లు, మాంసపు కోళ్లు, పొదుగుడు గుడ్లపై ఇంతకుముందు విధించిన నిషేధాన్ని కువైట్ పిఎఎఎఫ్ఆర్ (పబ్లిక్ అథారిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్) గత అక్టోబర్లోనే తొలగించింది. అయితే ఇటీవల త్రిపురలో కోళ్లకు బర్డ్ఫ్లూ వైరస్ సోకిన ఉదంతం వెలుగులోకి రావడంతో భారత్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై కువైట్ మళ్లీ నిషేధం విధించిందని ప్రభుత్వం అధికారిక నోటీసులో వెల్లడించింది.భారత పౌల్ట్రీ ఉత్పత్తులు ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలకే ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో భారత్ నుంచి కువైట్ 1.20 లక్షల డాలర్ల విలువచేసే 24.2 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. 2014-15 తొలి మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) మన దేశం నుంచి మొత్తం రూ.484 కోట్ల విలువైన పౌల్ట్రీ ఎగుమతులు జరగ్గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.584 కోట్లకు పెరిగాయి. అయితే ప్రస్తుతం కువైట్లో విధించిన నిషేధం వలన మున్ముందు మన దేశ పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







