టీచ్ ఫర్ చేంజ్ సంస్థ నిర్వహించిన సెలబ్రిటీస్ షో
- March 10, 2016
టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణ కార్యక్రమం గురువారం రాత్రి తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించేందుకు 101 డైనింగ్ టేబుల్ వద్ద వినూత్నరీతిలో ఫ్యాషన్ షోను నగర డిజైనర్ శిల్పారెడ్డి నిర్వహించారు. శిల్పా డిజైన్స్ ధరించి నటులు రానా దగ్గుబాటి, లక్ష్మీ మంచు, ఆదాశర్మ, లావణ్య త్రిపాఠి, సోనల్ చౌహాన్, అడివి శేష్, షర్మిలా మంద్రే, పూనమ్ కౌర్, మధుషాలినీ, ప్రగ్యా జైశ్వాల్, నికోల్ ఫారియా, సంధ్యారాజు, రోహిత్ ఖండేల్వాల్ తదితరులు ర్యాంప్పై హొయలు పోయారు. పూర్వ మిస్ యూనివర్స్, నటి సుస్మితా సేన్తో పాటు నగర సోషలైట్ పింకీ రెడ్డి, పూర్వమంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారులకు మెరుగైన విద్య అందించడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు.. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఇంతటి మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం అందించడానికి తానెప్పుడూ సిద్ధమని సుస్మితాసేన్ అన్నారు. ఎంత సంపాదించామన్నది కాదు.. ఏం చేశామన్నదేశాశ్వతం. సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం.. వాటిలో పాల్గొనటం తాను పాల్గొనటం చాలా ఆనందంగా ఉందని గీతారెడ్డి అన్నారు.-
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







