సౌదీలో ఉద్యోగాలు కోల్పోనున్న భారతీయ వలసదారులు
- March 10, 2016
సౌదీ అరేబియా తమ పౌరులకు ఇంకా ఎక్కువగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకోసం తీసుకుంటున్న చర్యలు భారతీయ వలసదారులకు అక్కడ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయి. సౌదీ అరేబియా తాజాగా మొబైల్ ఫోన్ దుకాణాల్లో మూడు నెలల్లోగా వలస కార్మికులు లేదా ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించి, సౌదీ అరేబియా వాసులతో భర్తీ చేయవలసి ఉంటుంది. ఆరు నెలల్లో మొత్తం 100 శాతం సౌదీ అరేబియా వాసులే ఆయా దుకాణాల్లో పనిచేయవలసి ఉంటుంది. సెప్టెంబర్ దీనికి తుది గడువుగా నిర్ణయించారు. మినిస్టర్ ఆఫ్ లేబర్ ముఫ్రెజ్ అల్ హక్బానీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ తాజా నిర్ణయంతో సౌదీ అరేబియా వాసులకు మరింతగా ఉద్యోగాలు లభిస్తాయని మినిస్టర్ చెప్పారు. సౌదీ యువత మరియు మహిళలకు ఈ రంగాల్లో శిక్షణ ఇప్పించి, ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారాయన. సౌదీ అరేబియా రిటైల్ మరియు సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా సౌత్ ఇస్ట్ ఆసియా అందులోనూ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చినవారే ఎక్కువగా పనిచేస్తున్నారు. సౌదీ పౌరులతో పోల్చితే వీరికి దక్కే వేతనాలు తక్కువ. ప్రైవేట్ సెక్టార్లో 10 శాతం సౌదీ జాతీయులకే ఇవ్వాలంటూ 'నితాకత్' నిర్ణయం తీసుకున్నాక పెద్ద 1.41 లక్షల మంది ఇండియన్స్ సౌదీ అరేబియాని విడిచిపెట్టారు. ఈసారి ఇంకా ఎక్కువగా భారతీయులు సౌదీలో ఉద్యోగాలు కోల్పోయి, స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా వలసదారుల్లో 20 శాతం భారతీయులే ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







