సౌదీలో మిలిటరీ ఎక్సర్‌సైజ్‌కి హాజరైన షేక్‌ మహమ్మద్‌

- March 10, 2016 , by Maagulf
సౌదీలో మిలిటరీ ఎక్సర్‌సైజ్‌కి హాజరైన షేక్‌ మహమ్మద్‌

కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రసీద్‌ అల్‌ మక్తౌమ్‌, మరి డిఫెన్స్‌ లీడర&్స, అధికారులు నార్తరన్‌ థండర్‌ ఎక్సర్‌సైజ్‌ని ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న కింగ్‌ ఖాలిద్‌ మిలిటరీ సిటీలో ఈ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ ప్రారంభమయ్యింది. యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సహా 19 ఇతర దేశాలకు చెందిన ఆర్మీ స్నేహపూర్వక విన్యాసాల్లో పాల్గొన్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాల మధ్య సఖ్యతకు ఈ ఎక్సర్‌సైజ్‌ తోర్పడుతుందని విన్యాసాలను హాజరైన వివిధ దేశాల ప్రముఖులు కొనియాడారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించడానికి సరైన విజయం ఒక్కటి సరిపోతుందని ఈ సందర్భంగా షేక్‌ మహమ్మద్‌ చెప్పారు. అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ సుప్రీమ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ రేపు మిలిటరీ ఎక్సర్‌సైజ్‌ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com