కొత్త సీఎస్ఐ చర్చి కోసం 500,000 దిర్హాముల విరాళమిచ్చిన యూసుఫ్ అలీ

- July 23, 2021 , by Maagulf
కొత్త సీఎస్ఐ చర్చి కోసం 500,000 దిర్హాముల విరాళమిచ్చిన యూసుఫ్ అలీ

అబుదాబీ: లులు గ్రూపు చైర్మన్ య‌ూసుఫ్ అలీ, చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) నిర్మాణం కోసం 500,000 దిర్హాములు విరాళమందించారు. అబుదాబీలో 15,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ చర్చి నిర్మితమవుతోంది. 500,000 దిర్హాముల చెక్, సీఎస్ఐ పరిష్ రెవ లాల్జీ ఎమ్ పిలిప్, అలాగే రెవ డాక్టర్ మలాయిల్ సబూ కోషి చరియన్ తదితరుల సమక్షంలో ఈ చెక్ అందించారు. ఫాదర్ లాల్జీ ఈ సందర్భంగా యుఏఈ నాయకత్వానికి కృతజ్ణతలు తెలిపారు. యూసెఫ్ అలీకి కూడా కృతజ్నతలు తెలిపారు. యూఏఈలో భిన్న దేశాలకు చెందిన, భిన్న మతాలకూ, సంస్కృతులకు చెందిన వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని యూసెఫ్ అలీ చెప్పారు. మినిస్టర్ ఆఫ్ టోలరెన్స్ మరియు కో - ఎడ్జిస్టెన్స్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, చర్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఏడాది నవంబరులో ఈ పనులు ప్రారంభమయ్యాయి. 750 మంది ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com