భారత్ కరోనా అప్డేట్

- July 26, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.తాజాగా దేశంలో కొత్త‌గా 39,361 కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 35,968 మంది కోలుకున్నారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 3,05,79,106కి చేరింది.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్‌లో క‌రోనాతో 416 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 4,20,967 మంది మృతి చేందారు.ఇక దేశంలో 4,11,189 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇండియాలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చురుగ్గా సాగుతున్న‌ది.భారత్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 43,51,96,001 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com