ప్రభుత్వ ఈ-బిజ్ పోర్టల్లో కొత్త సర్వీసులు
- June 04, 2015
వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా ఈ-బిజ్ పోర్టల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి 36 సర్వీసులను అనుసంధానం చేయాలని కేంద్రం ప్రతిపాదిం చింది. పర్యావరణ అనుమతులు, ఆస్తి పన్ను, ఫ్యాక్టరీల లెసైన్సులు మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. పెట్టుబడుల ప్రతిపాదనలన్నింటికి ఒకే చోట అనుమతులు ఇచ్చేలా ఈ-బిజ్ పోర్టల్కు ప్రభుత్వం రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీయే ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ.. ఈ-బిజ్ పోర్టల్తో అనుసంధానించేందుకు 12 కేంద్ర ప్రభుత్వ సర్వీసులు గుర్తించినట్లు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) పేర్కొంది. 9 రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన 24 సర్వీసులు అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







