యూఏఈ ఎతిహాద్ రైల్: మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద టన్నెల్ తవ్వకం పూర్తి

- July 26, 2021 , by Maagulf
యూఏఈ ఎతిహాద్ రైల్: మిడిల్ ఈస్ట్‌లో అతి పెద్ద టన్నెల్ తవ్వకం పూర్తి

యూఏఈ: ఎతిహాద్ రైలు ప్రాజెక్టుకి సంబంధించి, మిడిల్ ఈస్టులోనే అతి పెద్ద టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. చైనా సివిల్ ఇంజనీరింగ్ కనస్ర్టక్షన్ కార్పొరేషన్ 1.8 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం పనుల్ని పూర్తి చేసింది. అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. 2019లో ఎతిహాద్ రైలు 4.6 బిలియన్ దిర్హాముల టెండరును సివిల్ పనులు మరియు నిర్మాణం ప్యాకేజీ డి - స్టేజ్ 2 కోసం ఇవ్వడం జరిగింది. 145 కిలో మీటర్ల ప్యాకేజీ డి లో 15 టన్నెళ్లు ఉన్నాయి. మొత్ం 16 కిలో మీటర్ల మేర ఇవి ఉంటాయి. 35 బ్రిడ్జిలు, 32 అండర్ పాస్‌లు ఈ ప్యాకేజీలో భాగం. ఫుజారియా మరియు ఖోర్‌ఫక్కన్ పోర్టుల్ని దుబాయ్ షార్జా బోర్డరుతో ఈ రైలు నెట్‌వర్క్ కలుపుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com