టోక్యో ఒలింపిక్స్: హాకీలో భారత జట్టు ఘన విజయం
- July 27, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన పురుషుల హాకీ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. స్పెయిన్తో జరిగిన పూల్-ఎ మూడో మ్యాచ్లో 3-0తో అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆట ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత జట్టు అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసింది.
తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్జీత్ సింగ్ మరో గోల్ చేశాడు.
తాజా వార్తలు
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!









