కువైట్ లో ముగ్గురు నర్సులు అరెస్ట్!
- July 27, 2021
కువైట్: డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా క్రిమినల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారు.వ్యాక్సిన్ వేసుకోని వారి దగ్గర నుంచి 250-300 కువైటీ దినార్లు తీసుకుని వీరు నకిలీ కరోనా సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇలా మొత్తం నలుగురికి ఫోర్జరీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. కువైట్ లోని జహ్రా ఆస్పత్రికి చెందిన ఈ ముగ్గురు నర్సులు ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్లతో గత కొంతకాలంగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ గుర్తించింది.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









