భారత జట్టులో కరోనా కలకలం
- July 27, 2021
కొలంబో: భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శివారు ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈరోజు భారత్-లంక ల మధ్య రెండో పొట్టి మ్యాచ్ జరగాల్సి ఉండగా తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో భారత బృందం మొత్తం ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మరో ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వహిస్తారా.. లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి. అయితే మిగితా భారత ఆటగాళ్లకు అందరికి నెగెటివ్ గా నిర్ధారణ అయితే ఈ మ్యాచ్ ను యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







