భారత జట్టులో కరోనా కలకలం
- July 27, 2021
కొలంబో: భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శివారు ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈరోజు భారత్-లంక ల మధ్య రెండో పొట్టి మ్యాచ్ జరగాల్సి ఉండగా తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో భారత బృందం మొత్తం ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మరో ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వహిస్తారా.. లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి. అయితే మిగితా భారత ఆటగాళ్లకు అందరికి నెగెటివ్ గా నిర్ధారణ అయితే ఈ మ్యాచ్ ను యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









