భారత జట్టులో కరోనా కలకలం
- July 27, 2021
కొలంబో: భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే కోహ్లీ నేతృత్వంలోని ఓ భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తుండగా శివారు ధావన్ కెప్టెన్సీలోని మరో జట్టు శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లో తలపడుతుంది. అయితే ఇప్పటికే వన్డే సిరీస్ ను 2-1 తో ధావన్ సేన సొంతం చేసుకోగా ప్రస్తుతం టీ20 సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఇక ఈరోజు భారత్-లంక ల మధ్య రెండో పొట్టి మ్యాచ్ జరగాల్సి ఉండగా తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలో కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో భారత బృందం మొత్తం ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మరో ఈరోజు జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను నిర్వహిస్తారా.. లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి. అయితే మిగితా భారత ఆటగాళ్లకు అందరికి నెగెటివ్ గా నిర్ధారణ అయితే ఈ మ్యాచ్ ను యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









