ఆ మృతదేహం ఎవరిది..? ప్రవాసీయుల సాయం కోరిన పోలీసులు
- July 28, 2021
దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి దేశంగానీ దేశంలో ఊపిరి వదిలాడు. కానీ, అతను ఎవరో తెలియదు. ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు.ఎడారి ప్రాంతంలో మృత్యుఒడికి చేరి అనాధ శవంలా మిగిలిపోయాడు. అయితే...అతని వివరాలను తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముహైసినా ప్రాంతంలో ఇసుక తిన్నెల్లో ఆసియన్ మృత దేహం లభించిందని, అయితే..తాను ఎవరనే విషయం తెలియటం లేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రాలు పోలీసులకు దొరకలేదు. ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో మృతుడిని గుర్తించటంలో సహాయపడాలని ప్రవాసీయులను కోరారు దుబాయ్ పోలీసులు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









