బంగాళాఖాతంలో అల్పపీడనం
- July 28, 2021
తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. మరోవైపు తాజాగా ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవి రానున్న 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజుల్లో పశ్చిమ దిశలోని పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడన ప్రభావం కోస్తాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల కదలికలో మందగమనం కొనసాగనున్నందున ఎండ తీవ్రత పెరగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, గురువారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం
- విజయ్ కీలక నిర్ణయం..
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!









