మంచి పేరు, ట్యాగ్ లైన్, లోగో తయారీకి..15లక్షల బహుమతి.!
- July 28, 2021
న్యూ ఢిల్లీ: క్రీడాపోటీలో, క్విజ్ పోటీలో, పాటల పోటీలో ఇప్పటివరకు చూసుంటాం..ఆ పోటీలలో నెగ్గిన వారికి మెమాంటోలతోపాటు, కొంత ఫ్రైజ్ మనీ కూడా ఇస్తారు. చాలా మంది ఫ్రైజ్ మనీ వస్తుందనగానే ఆసక్తిగా పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఈ తరహా పోటీనే నిర్శహించబోతుంది. ఈ పోటీలో గెలిచిన వారికి భారీ బహుమతులను ఇస్తామని కూడా ప్రకటించింది. ఇంతకీ దీనికి సంబంధించిన వివరాలేంటంటే..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పన కోసం డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిట్టిట్యూషన్ కి ఆమోదం తెలిపింది. కొత్త సంస్ధ ఆవిర్భావం కావటంతో దానికి సంబంధించిన పేరు, ట్యాగ్ లైన్, లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ సంస్ధ అసలు లక్ష్యాన్ని సూచించేలా పేరు, ట్యాగ్ లైన్, లోగోను డిజైన్ కోసం కేంద్ర ఆర్ధిక శాఖ పోటీలను నిర్వహించనుంది. ఆగస్టు 15వ తేదిలోగా వీటికి రూపకల్పన చేసి అందించాలని కోరింది.
వచ్చిన ఎంట్రీలన్నింటిని పరిశీలించి వాటిలో బాగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వాటిలో ఒక్కో విభాగంలో మొదటి స్ధానంలో నిచినవారికి 5లక్షలు చొప్పున మొత్తం 15లక్షలు బహుమతిగా అందిస్తారు. రెండోస్ధానంలో నిలిచిన వారికి 3లక్షలు, మూడో స్ధానంలో నిలిచన వారికి 2లక్షల రూపాయలను బహుమతిగా అందజేస్తారు.
డీఎఫ్ఐ కి సంబంధించిన పేరు, ట్యాగ్ లైన్ , లోగో డిజైన్ కు సంబంధించి కొన్ని నియమాలు కూడా పాటించాలని కేంద్రం సూచించింది. తయారు చేసే వాటిలో దేశ సంస్కృతి ప్రతిబింబించటంతోపాటు, ప్రజలందరికి అర్ధమయ్యేలా, పలకటానికి వీలుగా ఉండాలని చెప్పింది. డిజైన్లు పూర్తయిన వెంటనే ఆగస్టు 15వతేది సాయంత్ర 5.30 సమయానికి ఆర్ధికశాఖ వెబ్ సైట్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపాలని కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









