ఏపీలో జాబ్ మేళా.!
- July 28, 2021
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మూడు ప్రముఖ సంస్థల్లో ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న అనంతపూర్ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగా APSSDC వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9010039901 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
-Needs Services Pvt Ltd(Amazon) సంస్థలో 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్, బార్ కోడ్ స్కానింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఇంటర్, డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 13,140 వరకు వేతనం చెల్లించనున్నారు.
-Fresh Minds సంస్థలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
-FUTURZ(Flipkart): ఈ సంస్థలో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పికింగ్, ప్యాకింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల వరకు వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 12-26 ఏళ్లు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం పది గంటలకు నలంద డిగ్రీ కాలేజీ, రామ్ నగర్, అనంతపూర్ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









