రాచకొండ,సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం
- July 31, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటంచిన PRC-2020 జీత,భత్యాలను సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ లోని పోలీసు సిబ్బంది మొత్తానికి (సుమారుగా 10,400 మందికి) జూన్ నెల ఏరియర్స్ అందించి, జూలై 2021 కొత్త జీతాన్ని అందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కి, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కి రాచకొండ, సైబరాబాద్ పోలీసుల వారి తరుపున పోలీసు అధికారుల సంఘం వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పిఆర్సి–2020 జీత, భత్యాలను సిబ్బందికి అందజేయాలని రాచకొండ,సైబరాబాద్ సీపీల ఆదేశాలతో సైబరాబాద్ డీసీపీ అనసూయ, రాచకొండ డీసీపీ శిల్పవల్లి వారి పర్యవేక్షణలో గతకొద్ది రోజుల నుండి నిరంతరం శ్రమించిన రాచకొండ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ సుగుణ, సైబరాబాద్ చీఫ్ అక్కౌంట్స్ ఆఫీసర్ చంద్ర కళ, సైబరాబాద్ అసిస్టెంట్ అక్కౌంట్స్ ఆఫీసర్ ధర్మరాజ్, రాచకొండ అక్కౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్,సైబరాబాద్ జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ మధులత,రాచకొండ జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ అనిల్ మరియు వారి సిబ్బంది రాచకొండ, సైబరాబాద్ పోలీసు వారికి సకాలములో పిఆర్సి 2020 ఫలాలు మంజూరు చేసినందుకు సైబరాబాద్ పోలీసు అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







