న్యూ ఎడ్యుకేషనల్ పార్క్ పనులు ప్రారంభం
- July 31, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్ కంపెనీ (ఎడామాహ్) మరియు అమానత్ - ఎడ్యుసేఫ్ పార్క్, కొత్త ఎడ్యుకేషన్ పార్కు (ఇసా టౌన్లో) కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. స్కూల్ తర్వాతి సమయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరింత ఉపయోగపడేలా ఈ ఎడ్యుకేషన్ పార్క్ కొత్త ఆలోచనలకు ఆస్కారం కలిగిస్తుంది. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మాజిద్ బిన్ అలి అల్ నుయైమి, డాక్టర్ షేకా మే బింట్ సులైమాన్ అల్ ఒతౌబి (అమానత్ ఫౌండర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్), డాక్టర్ మొహమ్మద్ ముబారక్ బిన్ అహ్మద్ (ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎఫైర్స్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లైబ్రరీ, స్పోర్ట్స్ హాల్స్ వంటివి ఈ కేంద్రంలో కొలువుదీరనున్నాయి. తొలి ఫేస్ ఎడ్యుకేషనల్ పార్క్ ఏప్రిల్ 22 నాటికి అదుబాటులోకి రావొచ్చు. రెండో ఫేస్ 2022 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









