అప్పటిదాకా ఇండియా ఫ్లైట్ బ్యాన్: యూఏఈ ప్రయాణీకులు తెలుసుకోవాల్సిందేంటి.?

- July 31, 2021 , by Maagulf
అప్పటిదాకా ఇండియా ఫ్లైట్ బ్యాన్: యూఏఈ ప్రయాణీకులు తెలుసుకోవాల్సిందేంటి.?

యూఏఈ: భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆగస్ట్ వరకు అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించినట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.అయితే, పూర్తిగా అన్నిటిపైనా బ్యాన్ వుంటుందనుకోవడం పొరపాటు. అంతర్జాతీయ కార్గో విమానాలకు ఎలాంటి ఇబ్బందులూ వుండవు. ఇండియా, 24 దేశాలతో ఎయిర్ బబుల్ ప్యాక్ట్స్ కలిగి వుంది. వాటిల్లో యూఏఈ, యూఎస్, యూకే, కెన్యా, నేపాల్, భూటాన్ మరియు ఫ్రాన్స్ తదితర దేశాలున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో 65 శాతం సామర్థ్యంతో విమానాలు నడపాల్సిందిగా డొమెస్టిక్ క్యారియర్స్‌ని ఆదేశించారు. ఆ తర్వాత దాన్ని 100 శాతానికి పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com