ఏపి కరోనా అప్డేట్

- August 01, 2021 , by Maagulf
ఏపి కరోనా అప్డేట్

అమరావతి: ఏపిలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,287 మంది పాజిటివ్‌గా నమోదు కాగా…మరో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 2,430 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,68,462 కు చేరుకోగా..రికవరీ కేసులు 19,34,048 కు పెరిగాయి.ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 13,395 మంది మృతి చెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,019 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇక నిన్న ఒక్క రోజే ఏపిలో 85,856 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,46,48,899 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com