మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- November 21, 2025
మయన్మార్లో(AP) సైబర్ నేరగాళ్ల పంజా చిక్కి మోసపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.భారత ప్రభుత్వం వారి రక్షణ కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, థాయ్లాండ్ మార్గం ద్వారా వీరిని ఢిల్లీలోకి తరలించింది. మొత్తం 370 మంది భారతీయులు స్వదేశానికి తీసుకువచ్చబడినందులో 55 మంది ఏపీకి చెందినవారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రభుత్వ అధికారులు బాధితులను ఏపీ భవన్ సిబ్బందికి అప్పగించి, తక్షణమే తాత్కాలిక వసతి, భోజన సౌకర్యాలను అందించారు. మయన్మార్లో మోసపోయిన వ్యక్తులు మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకోలేక ఇబ్బందిలో ఉన్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి బాధితునికి రూ. 1,000 ఆర్థిక సహాయం అందించింది.
తదుపరి, రైల్వే అధికారులతో సమన్వయం చేసి, ఎమర్జెన్సీ కోటాలో టిక్కెట్లు కేటాయించారు. బాధితులు తమ స్వస్థలాలకు రైళ్ల(AP) ద్వారా ప్రయాణం ప్రారంభించారు. కష్టకాలంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 24 మంది వ్యక్తులను ప్రభుత్వం రక్షించగా, తాజా ఆపరేషన్తో మయన్మార్లో సైబర్ నేరగాళ్ల నుండి రక్షించబడిన ఆంధ్రప్రదేశ్ వాసుల సంఖ్య 79కి చేరింది.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







