మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- November 21, 2025
మయన్మార్లో(AP) సైబర్ నేరగాళ్ల పంజా చిక్కి మోసపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 55 మంది సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.భారత ప్రభుత్వం వారి రక్షణ కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, థాయ్లాండ్ మార్గం ద్వారా వీరిని ఢిల్లీలోకి తరలించింది. మొత్తం 370 మంది భారతీయులు స్వదేశానికి తీసుకువచ్చబడినందులో 55 మంది ఏపీకి చెందినవారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారత ప్రభుత్వ అధికారులు బాధితులను ఏపీ భవన్ సిబ్బందికి అప్పగించి, తక్షణమే తాత్కాలిక వసతి, భోజన సౌకర్యాలను అందించారు. మయన్మార్లో మోసపోయిన వ్యక్తులు మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకోలేక ఇబ్బందిలో ఉన్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి బాధితునికి రూ. 1,000 ఆర్థిక సహాయం అందించింది.
తదుపరి, రైల్వే అధికారులతో సమన్వయం చేసి, ఎమర్జెన్సీ కోటాలో టిక్కెట్లు కేటాయించారు. బాధితులు తమ స్వస్థలాలకు రైళ్ల(AP) ద్వారా ప్రయాణం ప్రారంభించారు. కష్టకాలంలో అన్ని ఏర్పాట్లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 24 మంది వ్యక్తులను ప్రభుత్వం రక్షించగా, తాజా ఆపరేషన్తో మయన్మార్లో సైబర్ నేరగాళ్ల నుండి రక్షించబడిన ఆంధ్రప్రదేశ్ వాసుల సంఖ్య 79కి చేరింది.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







