బెన్ఫిషియల్ ఓనర్ వివరాలు ఇవ్వని 148 కంపెనీలకు ఫైన్
- August 04, 2021
దుబాయ్: దుబాయ్ ఆర్ధికశాఖలోని వాణిజ్య సమ్మతి, వినియోగదారుల రక్షణ-CCCP 148 కంపెనీలకు జరిమానా విధించింది. వాణిజ్య, పారిశ్రమల చట్టాలను అనుసరించి కంపెనీలు తమ బెన్ఫిషియరీ ఓనర్ వివరాలను నిర్ణీత కాల వ్యవధిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ పాలనా యంత్రాంగం గత జూన్ 30 నాటికి కంపెనీలను వివరాలను పొందుపర్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే..అధికారులు సూచించిన గడువులోగా బెన్ఫిషియర్ ఓనర్స్ వివరాలను కమర్షియల్ రిజిస్ట్రి వద్ద నమోదు చేసుకోని కంపెనీలకు CCCP ఫైన్ విధించింది. నిబంధన ఉల్లంఘించిన ఒక్కో కంపెనీకి AED 15,000 చొప్పున జరిమాన విధించారు. ఇకనైనా కంపెనీలు తమ బెన్ఫిషియల్ ఓనర్స్ వివరాలను దుబాయ్ ఎకానమీ ఇ -సర్వీసెస్ పేజీలో లేదా కాల్ సెంటర్ నెంబర్ +97144455555 ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









