ఎస్‌బీఐ ఖాతాదారులకు అలెర్ట్..

- August 05, 2021 , by Maagulf
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలెర్ట్..

న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. ఆగష్టు 6-7 మధ్య తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్ లావాదేవీలు పని చేయవని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

మెరుగైన బ్యాంకింగ్ సేవల నిమిత్తం మైంటైనెన్స్ పనులు జరుగుతున్నాయని.. అందువల్ల కస్టమర్లు తమకు సహకరించాలని” ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా కోరింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫార్మ్స్ అయిన యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు ఆగష్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగష్టు 7వ తేదీ తెల్లవారుజాము 1.15 గంటల వరకు పని చేయవని ఈ విషయాలను గుర్తించికోవాలని కస్టమర్లను సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com