33,000 మందికి కోవిడ్ ఫైన్స్ నుంచి మినహాయింపు

- August 06, 2021 , by Maagulf
33,000 మందికి కోవిడ్ ఫైన్స్ నుంచి మినహాయింపు

యూఏఈ: కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన 33,000 కేసుల్లో జరిమానాలను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రద్దు చేసింది. కొన్ని కేసుల్లో జరిమానాను తగ్గించింది. కోవిడ్ -19 ఉల్లంఘనలకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ 2020 ఇయర్‌బుక్‌లో మొత్తం 81,856 ఫిర్యాదులను రిమోట్ గ్రీవెన్స్ సిస్టమ్‌లో నమోదైనట్లు వెల్లడించింది. అయితే..ఇందులో 33,094 మంది అభ్యర్థనల మేరకు కొందరికి జరిమానాలను పూర్తిగా రద్దు చేయగా..ఇంకొందరికి ఫైన్ తగ్గించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ గణాంకాల మేరకు అత్యవసర, సంక్షోభం& విపత్తు ప్రాసిక్యూషన్ చట్టం పరిధిలో ప్రస్తుతం 32 క్రిమినల్ కేసులు, 486 అడ్మినిస్ట్రేటివ్ కేసులు మరియు 100 రిమోట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇదిలాఉంటే 2020 లో మొత్తం 18,050 తీర్పులు వెలువరించగా..ఇందులో 95 శాతం దోషుల రేటు నిర్ధారించబడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com