బహ్రెయిన్లోనూ రూపే కార్డు సేవలు..బెన్ఫిట్ తో NPCI టై

- August 07, 2021 , by Maagulf
బహ్రెయిన్లోనూ రూపే కార్డు సేవలు..బెన్ఫిట్ తో NPCI టై

మనామా: భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తొలి ఎలక్ట్రానిక్ పేమేంట్ కార్డు..రూపే కార్డ్. ఇప్పుడు ఈ రూపే కార్డును బహ్రెయిన్లోనూ వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-NPCI...బహ్రెయిన్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్& ఫిన్టెక్ సంస్థ బెన్ఫిట్ తో ఒప్పందం కుదర్చుకుంది. దీంతో కింగ్డమ్ వ్యాప్తంగా 515 ఏటీఎమ్ లలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అలాగే 40 వేల వ్యాపార సముదాయాల్లోనూ(పాయింట్‌ ఆఫ్‌ సేల్స్-POS‌) రూపే కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com