20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్

- August 10, 2021 , by Maagulf
20 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్

ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఒమన్ చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రోగ్రాం టార్గెట్ వర్గాల్లో 57 శాతానికి చేరింది. అంటే సుల్తానేట్లో వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటివరకు 20,08,140 మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 68% మంది ఉన్నారు. అంటే 13,59,622 మందికి ఫస్ట్ డోస్ అందింది. కాగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 6,48,518 మందికి చేరుకుంది. అంటే లక్ష్య జనాభాలో 32 శాతం. కోవిడ్ నుంచి ప్రజలకు ఆరోగ్య భద్రత అందించేందుకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేస్తున్నామని..అన్ని గవర్నరేట్లలో టీకాలు వేయటం కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com