40 లక్షల మార్క్ చేరుకున్న వ్యాక్సినేషన్
- August 12, 2021
ఖతార్: కోవిడ్ ఎదుర్కునేందుకు కమ్యూనిటీ ఇమ్యూనిటీ ప్రోగ్రాంను ముమ్మరం చేసిన ఖతార్..నిన్నటితో 40 లక్షల మైలు రాయి చేరుకుంది. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 40,12,536 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు గణాంకాలతో వివరించింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హత ఉన్న(12 ఏళ్లు పైబడిన వారు) వారిలో దాదాపుగా 88.8 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని స్పష్టం చేసింది. 74.9 శాతం మందికి రెండు డోసులు అందాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 21,570 మందికి వ్యాక్సిన్ అందించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకొని బాధ్యతాయుతంగా మసలుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









