హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి..!

- August 14, 2021 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి..!

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.కిన్నౌర్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.మూడు రోజుల క్రితం కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 11 మంది చనిపోయారు, 14 మంది గాయపడ్డారు.మరో 30 మంది ఆచూకీ కోసం ఇంకా గాలింపు జరుపుతున్నారు. కొండచరియల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com