17 మంది ఉగ్రవాదులు మృతి : యెమెన్‌

- March 13, 2016 , by Maagulf
17 మంది ఉగ్రవాదులు మృతి : యెమెన్‌

 యెమెన్‌లోని అడెన్‌ సమీపంలో గల అల్‌ మన్సురా జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 17 మంది అనుమానిత అల్‌ఖైదా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతాధికారులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 20 మంది ఉగ్రవాదులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. హౌతి ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అడెన్‌ నగరాన్ని గతేడాది జులైలో సౌదీ మిత్రపక్షాలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అప్పటి నుంచి అక్కడి భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపినట్లు భద్రతా అధికారులు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com