బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకo

- March 13, 2016 , by Maagulf
బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకo

 ఈ ఏడాది నుంచి బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు రూ.1000 పింఛను ఇస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేసే అవకాశం లేదని.. ఎఫ్‌ఆర్‌బీఎం నిధులు పెంచాలని కోరామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్‌హౌస్‌ల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com