పూర్తి స్థాయికి చేరిన ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు

- August 17, 2021 , by Maagulf
పూర్తి స్థాయికి చేరిన ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు

కువైట్: ఇక నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో పనివేళల్ని పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించింది కువైట్. అందుకోసం ఉద్యోగులు అందరూ విధులకు హజరయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వీలైనంత వరకు వర్చువల్ విధానంలో ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యకలాపాలను మేనేజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సేవలు ప్రారంభం అయ్యాయి. వేసవి ముగిసే సమయానికి దేశంలో 70 శాతం మందికి వ్యాక్సిన్ చేరుతుందనే అంచనాలు ఉండటంతో పాటు వ్యాక్సిన్ తో ఇప్పటికే వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గిందని గణాంకాల సూచికలు సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తిరిగి విధులకుల హజరయ్యేలా కువైట్ ఆంక్షలను సడలిస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com