తిరిగి విధులకు హజరుపై కొన్ని వర్గాలకు మినహాయింపు
- August 17, 2021
అబుధాబి: కోవిడ్ ఆంక్షల నుంచి తిరిగి సాధారణ జనజీవనం వైపు అడుగులు వేస్తున్న అబుధాబి..తిరిగి విధులకు హజరయ్యే ఉద్యోగుల విషయంలో క్లారిటీ ఇచ్చింది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు విధులకు హజరు కావాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అబుధాబి హెల్త్ సెంటర్ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..విధులకు హజరయ్యే ఉద్యోగులు వైరస్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎలివేటర్ల ఉన్నప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. కరోనావైరస్ వ్యాప్తిని పరిమితం చేసేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ, రిమోట్ వర్కింగ్ మీటింగ్లు నిర్వహించాలని పిలుపునిచ్చింది, అలాగే హ్యాండ్షేక్ చేయడం పూర్తిగా మానుకోవాలని సూచించింది. వైరస్ ప్రభావాన్ని సాధారణ లక్షణాల స్థాయికి నియంత్రించటంలో వ్యాక్సిన్లు ప్రభావ వంతంగా పని చేస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకన్న వారికి కోవిడ్ సోకినా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం దాదాపుగా ఉండదని, దాదాపు రెండు రోజుల్లోనే లక్షణాలు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. మరణాల రేటు తగ్గుతుందని స్పష్టం చేసింది. ఓ మాదిరి నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా 024493333 నంబర్ను సంప్రదించాలని అబుధాబి హెల్త్ సెంటర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష