అఫ్గాన్ శరనార్ధులను ఆదుకోండి..ఖతార్ కు UN విన్నపం
- August 19, 2021
దోహా: ప్రాణాలను కాపాడుకునేందుకు అఫ్గాన్ నుంచి తరలొస్తున్న శరణార్ధుల విషయంలో మానవతా కోణంలో చూడాలంటూ ఐక్యరాజ్య సమితి..ఖతార్ ను కోరింది. ఇదే విషయంపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి..ఖతార్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్-థానీకి ఫోన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘన్ శరణార్థుల సమస్య పరిష్కారానికి, వారితో వ్యవహరించాల్సిన విధానాలపై అంతర్జాతీయ యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతపై చర్చించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వస్తున్న ఆఫ్గాన్ పౌరులను తిప్పిపంపేందుకు బలపెట్టొద్దని ఫోన్లో ఫిలిప్పో గ్రాండి కోరారు. అదే సమయంలో అఫ్గాన్ లో శాంతిస్థాపన కోసం, రాజకీయ సుస్ధిరత కోసం ఖతార్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







