రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు

- August 20, 2021 , by Maagulf
రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు

కువైట్: అబ్దాలీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్, ఓ బంగ్లాదేశీ, ఓ నేపాలీ ఈ ఘటనలో మృతి చెందారు. మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. క్రౌన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ జోసెఫ్ జేవియర్‌గా అతని వివరాల్ని వెల్లడించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com