రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు
- August 20, 2021
కువైట్: అబ్దాలీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్, ఓ బంగ్లాదేశీ, ఓ నేపాలీ ఈ ఘటనలో మృతి చెందారు. మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. క్రౌన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ జోసెఫ్ జేవియర్గా అతని వివరాల్ని వెల్లడించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







