కాబూల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా

- August 27, 2021 , by Maagulf
కాబూల్‌లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా

రియాద్: కాబూల్‌లో తీవ్రవాదులు బాంబు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బాంబు దాడులకు తీవ్రవాదులు పాల్పడగా పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్‌లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ఆఫ్ఘాన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com