కేరళలో విజృంభిస్తున్న కరోనా
- August 27, 2021
తిరువనంతపురం: భారత్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ తగ్గిపోతుందని అనుకున్నా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఇక కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.కేసులు భారీగా నమోదవుతున్నాయి.ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, 200 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఓనం ఫెస్టివల్ తరువాత ఈ పరిస్థితి నెలకొన్నది. గురువారం రోజున 30,007 కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం కేరళలో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రతీ వందమందిలో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో కరోనా రెండో దశ పీక్స్ దశలో ఉన్న సమయంలో కేరళలో 20 నుంచి 30 వేల వరకు కేసులు నమోదయ్యేవి.రెండో దశ నుంచి కోలుకున్నామని చెబుతున్న సమయంలో కూడా అదేవిధంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







