కేరళలో విజృంభిస్తున్న కరోనా
- August 27, 2021
తిరువనంతపురం: భారత్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్ తగ్గిపోతుందని అనుకున్నా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఇక కేరళలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.కేసులు భారీగా నమోదవుతున్నాయి.ప్రతిరోజూ 30 వేలకు పైగా కేసులు, 200 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. ఓనం ఫెస్టివల్ తరువాత ఈ పరిస్థితి నెలకొన్నది. గురువారం రోజున 30,007 కేసులు నమోదయ్యాయి.ప్రస్తుతం కేరళలో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించిన ప్రతీ వందమందిలో 18 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.దేశంలో కరోనా రెండో దశ పీక్స్ దశలో ఉన్న సమయంలో కేరళలో 20 నుంచి 30 వేల వరకు కేసులు నమోదయ్యేవి.రెండో దశ నుంచి కోలుకున్నామని చెబుతున్న సమయంలో కూడా అదేవిధంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!









