కరోనా బాధితులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలట: ICMR
- August 28, 2021
న్యూ ఢిల్లీ: కరోనా బాధితులు కోవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలని.. అది రెండు డోసులతో సమానంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా ఐసీఎంఆర్ చేపట్టిన అధ్యయనంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ పై పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుంటే వచ్చే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తున్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఈ అధ్యయనంలో కోసం ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య చెన్నైలోని వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్న హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల రక్త నమూనాలను సేకరించారు. వారిలో డోసు తీసుకున్న మొదటి రోజు, అలాగే డే 28, డే 56న SARS-CoV-2 నిర్దిష్ట యాంటీబాడీ ప్రతిస్పందనలను ఎలా ఉన్నాయని పరిశీలించారు. కోవాగ్జిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వైరస్ బాధితుల్లో.. అలాగే రెండు డోసులు తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకనివారిలోని యాంటీబాడీల ప్రతిస్పందనలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. అయితే ఇవి ప్రాధమిక ఫలితాలు మాత్రమేనని.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త లోకేష్ శర్మ వెల్లడించారు. ఒకవేళ ఇది గనక రుజువైతే రాబోయే కాలంలో కోవాగ్జిన్ టీకా సింగిల్ డోసు సిఫార్సు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









