యూఏఈ: కోవిడ్ 19: గండం దాదాపు గట్టెక్కినట్టేనన్న షేక్ మొహమ్మద్
- August 29, 2021
యూఏఈ: ఆగస్ట్ 29న జరిగిన క్యాబినెట్ సమావేశంలో దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పాండమిక్ సమయంలో యూఏఈ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందనీ, ఈ క్రమంలోనే క్లిష్టమైన పరిస్థితుల్ని అధిగమించగలిగామని చెప్పారాయన. యూఏఈ అంతా ఒక్కతాటిపై నిలిచి, కరోనా పాండమిక్ పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్లు వివరించారు.ఆగస్ట్ 24 నుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజువారీగా కేవలం 1000 లోపు మాత్రమే నమోదవుతున్నాయి.కాగా, 100 శాతం వ్యాక్సినేషన్ దిశగా యూఏఈ అత్యంత వేగంగా పనిచేస్తోంది. ఆగస్ట్ 28 నాటికి 87 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అందించగా, 76 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ జరిగింది.దేశానికి అవసరమైన మెడికల్ పరికరాలు, మెడిసిన్స్ వంటివాటిని తయారు చేసుకోవడం సమకూర్చుకోవడంలో మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని షేక్ హమదాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









